మాజిక్ రియలిజంను – మాంత్రిక వాస్తవికత – నిర్దుష్టంగా నిర్వచించడం సాధ్యంకాదు. వేర్వేరు రచయితల మాజిక్ రియలిజం పద్ధతుల మధ్య చాలా తేడాలు కనబడతాయి. చంద్రశేఖరరావు కూడా తనదైన చిత్రమైన మాంత్రిక వాస్తవికతను క్రమంగా సృజించుకోగలిగారు. ఆ తర్వాత ఆయన రాసిన కథలన్నింటిలోనూ అదే మౌర్నింగ్ వాతావరణం, గుడ్డసంచి భుజానికి తగిలించుకుని తిరిగే మోహనసుందరం, పూర్ణమాణిక్యం, మోహిని, పార్వతిలాంటి అవే పాత్రలూ, అదే విషాదభరిత కథనమూ…

“హైదరాబాదు జర్నలిస్టు కాలనీలో (ఇప్పుడది అపోలో హాస్పిటల్ దగ్గర వుంది.) చిన్న ఇల్లు కట్టుకున్నాను. దానికి సీతమ్మ గడప అని పేరుపెట్టుకున్నాను. బావుందా?” అని అడిగారు. “చాలా బావుంది. మొత్తానికి విశాఖ వాసన వుంది. గడపలు, వలసలు అక్కడివే కదా…” అన్నాను. ఆనందించారు. కాని పాపం ఆ ఇల్లు నిలుపుకోలేకపోయారు.

చాలామందికి పెయింటింగ్ అంటే కేన్వాస్ మీద ఆయిల్ కలర్స్‌తోనో ఆక్రిలిక్ రంగులతోనో వెలుగునీడలు చూపెట్టడంతోనే చిత్రంలోని ఆకారంలో చైతన్యం వస్తుంది. ఇది రేఖలతో సాధ్యం కాదనుకుంటారు; రేఖలు ‘కళ’ కిందికి రావనీ గీతలు, రేఖలనే స్ట్రోక్‌లతో నిండిన ఆకారాలను వట్టి ‘ఇలస్ట్రేషన్’ అనుకుంటారు. నిజానికి చిత్రకళకి అలాటి నియమం ఏదీ లేదు.

హరికి ఎందుకో కంగారుగా ఉంది. ముఖం నిండా చెమటలు పడుతున్నాయి. ఏదో చెడ్డవార్త వినాల్సి వస్తుందనే భావం లోలోపల గుబగుబలాడుతోంది. అతని గుండెల్లో పదేపదే భయంలాంటి కంగారు లాంటి భావం. “తీతువు అరుపులాగా నా గుండెల్లో ఈ శబ్దం ఏమిటి? ఏ ఉపద్రవం రానుందో?” అని దిగులుపడ్డాడు.

పొడవాటి కాలేజీ కారిడార్లలో
ఈ పాటతో మొదలైన పరిచయాలు, పదిలపడ్ద ఇష్టాలు
చీకటి ఒంటరి వేళల్లో ఈ పాటనెక్కి
చేసిన పాలపుంతల ప్రయాణాలు
ధూళిలా సనసన్నగా రాలుతున్న జ్ఞాపకాలు

ఆ పూట గాయాలు ముందు పోసుకుని కూచున్నాడు తాత. మనవడికి ఒక్కోటీ చూపెడుతూ. చిన్నప్పుడు గడప తగిలి బోర్లా పడి తగిలించుకున్నదీ. వెంటపడి కరిచిన కుక్క పంటి గాట్లూ. గోడ దూకీ, చెట్టు మీదనుంచీ పడిందీ. ఏదో పోటీ పడీ. ఓడీ. ఎవరితోనో గొడవ పడీ. కొన్ని దురాశ పడీ. నవ్వుతూ మనవడికి వర్ణించి చెబుతున్నాడు. గర్వంగా సాధించిన పతకాలు చూపినట్టూ. సిగ్గుపడుతూ రహస్యాలు చెప్పుకుంటున్నట్టూ.

అడవిలో తిరిగే పిశాచాల సాహచర్యంతో పైశాచీ భాష నేర్చుకుంటాడు గుణాఢ్యుడు. నేర్చుకోవడమేమిటి, ఆ భాషలో కవిత్వం అల్లగల పాండిత్యం సంపాదిస్తాడు! దీని కోసమే ఎదురు చూస్తున్న కాణభూతి అనే ఒక పిశాచం వచ్చి మహత్తరమైన కథలను వినిపిస్తాడు. వాటిని పైశాచీ భాషలో ఏడేళ్లు శ్రమపడి ఏడు లక్షల శ్లోకాలతో ఏడు బృహత్ గ్రంథాలుగా రచిస్తాడు గుణాఢ్యుడు. అయితే, ఆ అడవిలో అతనికి రాసేందుకు సాధనాలు ఎక్కడివి?

అనుభూతి, అనుభవం – పాత్రకి ఏది కలిగిందని రాసినా, ఆ కథ ముగిసేదే కదా. పాఠకుడైనా అంతే. ఆ మాత్రం దానికి ఎందుకనీ ఇంతలా నానా హైరానా పడిపోవడం. ఎందుకిన్ని మలుపులు. మరుక్షణం ఉంటుందో లేదో తెలియని బ్రతుక్కి సందేశాలు, ధర్మాలు, మంచి, చెడు, నీతి… అవినీతి… గొప్ప… చెత్త… తొక్క… తోలు… వీటిని కొనసాగించాలా? అన్నిటినీ కట్టగట్టి ఒకేసారి…

ప్రయాణాలంటే వింతలూ విశేషాలే కాదు.
ప్రకృతీ పరవశమూ మాత్రమే కాదు.
మనుషులు… మనుషులు… మనలాంటి మనుషులు!!
నిజానికి ఒకో మనిషీ ఒకో నడిచే మహాగ్రంథం…

మనం చదివే అలవాటూ బతికే అలవాటూ పోగొట్టుకోనట్టయితే!

ప్రకృతి కంపించే మోహంతో పెనవేసుకొంటున్న మహా సర్పాల వలె వారిద్దరి నగ్న దేహాలు. మందు పాతరల నుంచి దారుల్ని విముక్తం చేస్తున్న సిక్కు యువకుడి తొలి యవ్వన పరిమళం. హంగేరియన్ జానపద యువతి గాత్రంలోంచి వారి మైధున శరీరాల్లోకి ప్రవహిస్తున్న ఆదిమ కాంక్ష.

ఫోటోలో మనో నల్లని కళ్ళు నవ్వుతూ మెరుస్తున్నాయి. మెరుస్తూ కవ్విస్తున్నాయి. ఎర్రని పెదాల్లో కెంపుల కాంతులు తళతళలాడుతూ ‘నేను నీ దాన్ని కాను’ అని వెక్కిరిస్తున్నట్లున్నాయి. ఆ అందమైన ముఖంలో ఏదో ఆత్మవిశ్వాసం, తృప్తి. అదే ఆకర్షణ తనకి. కాని ఇన్నాళ్ళు ‘వద్దు వద్దని’ కాలయాపన చేశాడు. ఇంట్లో తండ్రి చండశాసనుడు. మనో కులం తెలిస్తే మండిపడతాడని భయం. ఎప్పుడూ భయమే! పిరికితనానికి ఏదో సాకు. చదువు అవ్వాలి.

హాస్యమనేది ప్రధానంగా బాధని వ్యక్తీకరించే వక్రీకరించే ఒక కటకం. దూరంగా ఎక్కడో దేని మీదో ప్రతిబింబించే హాస్యాన్ని వెనక్కి వెత్తుకుంటూ వెడితే దాని మూలం బాధ అని తేలుతుంది. ఈ బాధకి కారణలు కోకొల్లలు – శారీరిక/మానసిక లోపాలు, రుగ్మతలు, వైకల్యాలు, భయాలు, కోపాలు- ఇవన్నీ హాస్యానికి ముడిసరుకులే.

పుతిలీబావిడీ నుంచి జంటలు జంటలుగా సీతాకోక చిలుకల్లాగ వస్తున్నారు సుల్తాన్ బజార్లోకి అందరూ… సుల్తాన్ బజార్లో సుల్తానూ ఫకీరూ ఒకటే. ఏమీ పని లేకపోయినా ఏదో పని ఉన్నట్లు అటూయిటూ తిరుగుతారు. కాస్త కాళ్ళు నొప్పి పుట్టగానే జంక్షన్‌లో ఆగుతారు. ఆ ఇరానీ కేఫ్‌లో ఒక కప్పు టీ తాగుతారు. మళ్ళా తిరగడం మొదలెడతారు. ఇదో వరస.

శ్రీరామ భూపాలు డా – సీతతో
జేరి చనెఁ గాననములో
వారితోఁ దా వెళ్లెఁగా – వదలకను
వారిజాక్షుని నీడగా
ఘోర కాంతారములలోఁ – గూర్మితో
దూరముల గడచె నతఁడున్
చారుహాటకరూపుఁ డా – సౌమిత్రి
వీరవిక్రముఁడు గాదా…

ఆపరేషన్ అయిన నాలుగోనాడు ఇంకా హాస్పిటల్లో ఉండగానే మరోసారి గుండెల్లో నెప్పి వచ్చింది సుబ్బారావుకి. ఈ సారి రక్తంలో కట్టిన గడ్డ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పల్మోనరీ ఎంబోలిజమ్ వచ్చిందని కొత్త పేరు చెప్పేడు డాక్టరు; తాను సర్జరీ చేసినప్పుడు అజాగ్రత్తగా ఉండడం వల్ల రక్తం గడ్డ కట్టిందనీ ఆ గడ్డ మెల్లిగా ఊపిరితిత్తుల్లోకి ప్రయాణించిందనే తప్పు నొక్కిపెట్టి. ఏదైతేనేం, ఇంక మహా అయితే రెండు రోజులు బతకొచ్చు. ఈ లోపుల స్పృహలోకొచ్చి మాట్లాడితే గొప్పే.

వృత్తిపరంగా ఇంజనీర్ ఐన రవిశంకర్, ఎంచుకున్న వస్తువుల్ని నిశితంగా పరిశీలించి వివిధ కవుల కవిత్వాల్ని (చాలావరకు) నిర్మొహమాటంగా నిర్మాణాత్మకంగా వివరించటానికి నిజాయితీ ప్రయత్నం చేశారీ వ్యాసాల్లో. ఏ వ్యాసానికి ఆ వ్యాసం చదవటం వేరు, అన్నిటిని ఒకేచోట చదవటం వేరు.

సుదర్శనంగారి సతీమణి, స్వయానా పేరుపొందిన రచయిత్రి వసుంధరాదేవిగారు శ్రమకోర్చి ప్రేమతో పూనుకొని ఉత్తరాలన్నీ పద్ధతిగా పోగు చేసి, తగిన వివరాలు పొందుపరిచి ప్రచురించారు. గతాన్ని తెలుసుకొని భవిష్యత్ నిర్మాణంలో పాలుపంచుకునే జిజ్ఞాసువులందరూ ఓపికగా ఒకటికి రెండు సార్లు తిరగేయవలసిన పుస్తకం.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఈ సంచిక కోసం ఎప్పటిలాగా లలిత గీతాలు, సాహిత్య కార్యక్రమాలు, సంభాషణలు కాకుండా విజయవాడ రేడియో స్టేషన్ నుండి భక్తిరంజని కార్యక్రమంలో దశాబ్దాల పాటు వినబడిన కొన్ని కీర్తనలు, స్తోత్రాలు, అష్టకాలు లాంటివి వినిపిస్తున్నాను.

గడి నుడి-9కి చాలా తొందరగా తప్పుల్లేని పరిష్కారాలు వచ్చాయి. అన్ని సమాధానాలూ సరిగా పంపిన ఈ అయిదుగురు విజేతలకు అభినందనలు: 1. ఉరుపుటూరి శ్రీనివాస్ 2. వేదుల సుభద్ర, 3. రవిచంద్ర ఇనగంటి 4. టి. ఎస్. రాధిక 5. పంతుల గోపాలకృష్ణ. అలాగే, టి. చంద్రశేఖర రెడ్డి, వి. దీప్తి, పి. సి. రాములు, పి. వి. ఎస్. కార్తీక్ చంద్రగార్లు ఒక తప్పుతో సమాధానాలు పంపించారు (అచ్చు-తప్పు కాబోలు). వారందరికీ కూడా మా అభినందనలు.

గడి నుడి – 9 సమాధానాలు, వివరణ.