సంక్లిష్టమైన ఇతివృత్తాన్ని లేఖల ద్వారా కథనం చేయడంలో రచయిత్రి అపారమైన ప్రతిభ చూపింది. ఉత్తరాలనగానే కథకు మాత్రమే ఉపకరిస్తాయనిపిస్తుంది కాని, ఇందులో ఉత్తరాల ద్వారా అప్పటి సమాజం, ఆర్థిక వ్యత్యాసాలు, స్త్రీలను, పేదలను ధనవంతులు దోచుకునే విధానాలు, వాటికి వ్యవస్థ ఆమోదాలు అన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి.

రామాయణం రంకు, భారతం బొంకు అని ఒక నానుడి. భారతం విషయం నిర్వివాదం, అది ధర్మరాజు బొంకు కనుక. కాని రామాయణం విషయంలో ఆ నానుడి యీనాడు ఏమాత్రము నిర్వివాదం కాదు. ఆనాడు కానీ యీనాడు కానీ అన్ని అనర్థాలకు మూలం కామం. అది లేంది సృష్టిలేదు. కనుక, దాన్ని అదుపులో ఉంచుకోవడమే పురుషార్థసాధన. ఏ కావ్యవిషయమైనా ఆ విషయమే, ప్రాచ్యంగాని పాశ్చాత్యంగాని.

ఎడారిలో పూలు చూడటమన్నది వింతగొలపడం ఎప్పుడో మానేసిందిగానీ ఆ సాయంత్రం స్టేడియం మెట్రో స్టేషన్నుంచి ఇంటికి నడుస్తోన్నపుడు కురిసి గొడుగు తెరిచేలా చేసిన పది నిమిషాల వాన మాత్రం నాకు అపురూపమైన అనుభవాన్ని మిగిల్చింది. పూలను వికసింపజేయడం మానవ సాధ్యమే కావచ్చుగానీ ఆరుబయట వాన కురిపించటానికి దేవతలే కరుణించాలి.

పెళ్లానికైనా ఇవన్నీ చేశానా? ఆమెకైనా ఎందుకు చేయాలి? ఎప్పుడైనా పెళ్ళాంగా ఉందా? పూర్తి స్వాతంత్య్రం ఇచ్చా కదా! దేనిలో ఇచ్చా? అంతకంటే చేసేదేంటి, ఏం కావాలో అవి చేశా. ఆమెనేమన్నా అబ్యూజ్ చేశానా? ‘తిట్టడం కొట్టడం ఒక్కటే అబ్యూజా, ఇంట్లో ఇంకో మనిషి ఉందన్న ధ్యాస లేకుండా, తనతో బతికే మనిషిని పట్టించుకోని నిర్లక్ష్యం కంటే పెద్ద అబ్యూజ్ ఏముంటుంది?’ అనేది ఆమె.

ఎందుకో తెలీదు, వర్షంలో తడవనంటే చాలు మనస్సు ఎండిపోతుంది. తేలికపాటి జల్లుల్లో, ఏటవాలు రోడ్ల పైన పారుతున్న నీటి మీద స్ట్రీట్ లైట్ల వెలుతురు. వెలిసిపోయిన తెరపై నిజజీవితపు సినిమాని చూస్తున్నట్టు ఉంటుంది నాకు. అది చూస్తూ నడవాలని ఉంటుంది, ఆడాలని ఉంటుంది. డాన్స్ తప్ప నన్ను నేను మర్చిపోయే పని ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఇన్ని గుర్తొచ్చిన ప్రాణం ఊపిరిని కోరుకుంది.

తల్లిదండ్రులు పిల్లల చదువులు, కెరియర్లు వరకూ ఎంతైనా శ్రమపడతారు. వ్యక్తిత్వం రూపుదిద్దుకునే వయసులో ఆ పిల్లల్లో మానసికంగా ఎలాటి భావనలు కలుగుతున్నాయో, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారేమో అనేవాటి గురించి మాత్రం పట్టించుకోరు. అయినా బిడియపడకుండా, భయపడకుండా పిల్లలు తమ సమస్యను అమ్మ, నాన్నలతో చెప్పుకునే వాతావరణం ఎంతవరకు ఉంది?

కొత్త నిబంధనల గ్రంథం ప్రకారం, నమ్మిన వాళ్ళకి క్రీస్తు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానమే ఋజువుగా చలామణీ అవుతోంది. క్రీస్తు ఈ వాగ్దానాన్ని చేస్తున్న సమయంలో, ఆత్మశుద్ధిగల, నిజాయితీ పరులైన, స్వేచ్ఛగా ఆలోచించగల వ్యక్తుల నైతిక ప్రవర్తనని మరిచిపోయైనా ఉండాలి, నిర్లక్ష్యం చేసి అయినా ఉండాలి, లేదా తిరస్కారభావంతో చూసైనా ఉండాలి.

ఒక పాత ఒళ్ళుని మనుషుల ముందు పాతరేసి
తవ్వుకు తినమంటావు.

పెదాలను స్వాగతించే దమ్ము నీకెప్పుడూ రాదు.
పుట్టడం, పొందడం మాత్రమే
నిఘంటువులో ఉన్నాయని ధైర్యంగా అబద్దాలాడతావు.

కిక్‌లు కొట్టీ కొట్టీ చెమటతో తడిచిపోయి ఉంది ఆ మాస్క్ వేసుకున్నవాడి షర్టు. అతని పక్కనే బిక్కమొహం వేసుకుని వాడి ఫ్రెండ్ నిలబడి ఉన్నాడు. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్ ఊదుతూ స్కూటర్‌ని పక్కకు లాగమని దానిమీద లాఠీ పెట్టి కొడుతూ వాళ్ళను బెదరగొడుతున్నాడు. రుక్కు పక్కనే నెమ్మదిగా కదులుతున్న కారు ఫ్రంట్ సీట్‌లో ఉన్న పెద్దాయనకి రుక్కు ఎందుకు అలా తెరలుతెరలుగా నవ్వుకుంటుందో అర్థంకాలేదు.

దాసోహమన్నా ఋషిలా మూలిగినా
చేతులూ గుండె కవాటాలూ అన్నీ అప్పగించినా
మెలికలు తిరగటం ఆపేస్తానని
పేగులు మెలియబెడుతూ చెప్పే పచ్చి ఎర్రటి క్షణం

వింజామరల రేకలు రాలే తనం.
చాచిన నాలుకల్లోకి చేరే తనం.

చందులాల్‌గారిని గూర్చి ఆ కాలమున రెండు అభిప్రాయములుండెను. ఆయన కుటిలరాజ్యతంత్రజ్ఞుడనియు, లంచగొండియనియు, దుబారాఖర్చు చేయువాడనియు, దుర్మార్గుడనియు, కొందరాయనను గూర్చి చెప్పుచుండిరి. మరికొందరాయన చాలా మంచివాడనియు, కార్యదక్షుడనియు, స్నేహపాత్రుడనియు, దాతయనియు పొగడుచుండిరి.

నేను, నువ్వు తలో చోటా నడుస్తుంటాం
నీ దారిలో నేనుంటానో లేనో
నా దారిలో, నాలో నీవుంటావు.
ఈ దేహంలో, ఇదే మనసుతో
బ్రతకలేక బ్రతుకుతూ నేను
నైరూప్య లోకంలో నీవు
నేనే నీ వైపు నడిచి వస్తున్న భ్రమలాంటి సత్యం.

పుస్తకం తెరిచివున్నట్టే ఉంటుంది
రాసుకోవడానికే ఏమీ మిగలదు
గాలి పాడుతున్నట్టే ఉంటుంది
స్వరాలేవీ సరిగా ధ్వనించవు

అంకం తర్వాత అంకంగా సాగిన
ప్రయాణమంతా
కళ్ళముందు కదలాడుతుంటుంది

నాలుగు గోడల నడుమ
పోగుపడిన దుఃఖాన్ని
చెదరగొడదామని
ఒంటరితనపు కిటికీలు తెరచి
ఒక్క వెలుగుకిరణాన్నైనా
బహూకరిద్దామని
దిగులుపొగను ఊదేసి
నులివెచ్చని ఓదార్పవుదామని
సున్నితంగానే మునివేళ్ళను తాకిస్తాను.

ఏభై రోజుల కొండపొలం అనుభవాన్ని రచయిత వర్ణించిన తీరు అద్వితీయం! ఉత్కంఠభరితంగా, ముందుముందు ఏమవుతుందోనన్న ఆరాటంతో చివరివరకు చదివిస్తుంది. గొర్రెకాపరుల అనుభవాల్ని ఇంత చక్కగా వర్ణించి ఈ 21వ శతాబ్దంలో కూడా గొర్రెకాపరుల జీవితాలు ఇలా ఉంటాయా అన్న ఆశ్చర్యంలో మనల్ని ముంచెత్తుతుందీ నవల.

సంస్కృత సాహిత్య సంప్రదాయములపై ఆధారపడి తెలుగుకవులు తమ ప్రబంధాలలో పాటించిన కవిసమయములు, దోహదక్రియలు. సాలంకృతపద్మినీజాత్యంగనలు అకాలంలో తరులతాదులు పుష్పింపజేయుటకు చేయవలసిన క్రియలే దోహదక్రియలు. విజ్ఞానశాస్త్రముద్వారా సమర్థనీయము గాని ఈ సంప్రదాయమును పాటించి కవులు అత్యంతమనోరంజకమైన వర్ణనలు చేసినారు.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ. సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్ అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020), 2021 జనవరి 19, 20 & 21 తేదీలలో జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనేవారు ఈ క్రింది అంశాలలో మీకు నచ్చిన ఏ అంశాన్నైనా ఎన్నుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు.

పోటీ డిసెంబర్ 13, 2020 ఆదివారం పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహింపబడుతుంది. ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఫలితాలను డిసెంబర్ 20, 2020 ఆదివారం ప్రకటిస్తారు. పోటీకి నమోదుకు ఆఖరు తేదీ డిసెంబర్ 10, 2020.