చిన్న పల్లెటూరులో పుట్టిపెరగటం వెలుపలి జీవనంతో ఆవిడకు ఎక్కువ పరిచయాన్ని ఇవ్వలేదు. పుస్తకాలే ఆవిడ లోకం. ఆ పల్లెపట్టు సౌందర్యాన్ని లోపలికి తీసుకోగలిగే భావుకత స్వతహా వచ్చింది. లోపలేదో స్రవంతి… సరళంగా సహజంగా పొంగుతూ బయటపడింది. కథలు రాయటం మొదలైంది.

అర్జీలు పెట్టొచ్చు
దేబిరించవచ్చు
ఫేసుబుక్కులోకి పోయి స్టేటస్ పెట్టొచ్చు
ఏడ్చి అలమటించవచ్చు
రొప్పుతూ రోజుతూ బతుకు గడిపేయొచ్చు
రక్తం కక్కుకుంటూ చచ్చిపోనూ వచ్చు
చెయ్యడానికి ఎన్నిలేవు? (గొప్ప దేశభక్తులుగా మారి)

పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి కథల్లో తరుచుగా కనిపించే ప్రకృతి నేపథ్యం. అన్ని కథల వెనుక సన్నగా వయొలిన్ మీద వినిపించే విషాదపు జీర. ఆ విషాదపు జీరకు మూలం తెలుసుకుంటే కోపమూ కరుణా ముప్పిరిగొని ప్రపంచమంతా దిగులు మేఘాలు కమ్మినా, ముఖం చూపించని సూర్యుడి మీద అసహాయతతో కూడిన కోపం వస్తుంది పాఠకులకి.

మధ్యలో కనపడని మంచుగోడగా గడ్డకడుతూ గాలి. నేపథ్య సంగీతమెప్పుడు ఆగిపోయిందో తెలియదు. తొందరగా ముగిసిపోయిన ఒక ఆట. ఉద్విగ్నక్షణాలూ విరబూసిన రంగులూ జారిపోయిన, కరిగిపోయిన అనంతరం ఖాళీగా మిగిలిన సినిమా హాల్లా. ఇష్టంగా తినీ, తాగీ అక్కడక్కడా ఇప్పుడు చెత్తగా ఒదిలేసిన కొన్ని పట్టించుకోని జ్ఞాపకాలూ.

నీకు తోచిందేదో నువ్ చెప్తుంటావ్
వాడేదో ఆలోచిస్తూ వింటూంటాడు
నీకేదో తెల్సినట్టు నువ్వనుకుంటావ్
వాడికేదో తెలియనట్టు వాడనుకుంటాడు
నేను చెప్పింది వింటాడా అని నువ్వనుకుంటావ్
వీడు చెప్తోంది చెయ్యాలా అని వాడనుకుంటాడు

వాతావరణం ఒక్కసారి స్తంభించిపోయింది. బీడీల చేతులు ఆగిపోయినై. టీవీ నడుస్తుందన్నట్టేగానీ తెలియని నిశ్శబ్దం ప్రవేశించింది. నేను జయక్కతో కళ్లు కలపకుండా, అసలు ప్రత్యేకంగా ఎవరి మీదా చూపు నిలపకుండా అలాగే కూర్చున్నాను. ఎన్ని సెకన్లు దొర్లిపోయినై? అంతమందిలో ఎవరో కిసుక్కుమన్నారు. ఇక, నవ్వడమా మానడమా అన్నట్టుగా ఆగి నవ్వి ఆగి నవ్వి ఒక్కసారిగా అందరూ బద్దలైపోయారు.

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు కెరటాలు
రాత్రి ఒక సముద్రం.

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు శిలలు
రాత్రి ఒక ఎడారి.

కొంతకాలంగా ఆహవి తల్లితో సుముఖంగా మాట్లాడటంలేదు. ఏమి చెప్పినా దానికి బదులు మాట్లాడుతుంది. ఏమడిగినా వంకర సమాధానాలు చెప్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ‘ఎలా ఉన్నావు?’ అనడిగితే ‘దిట్టంగా ఉన్నాను!’ అంటోంది. ‘తిన్నావా?’ అని ప్రశ్నిస్తే అవుననో లేదనో అంటే సరిపోతుంది. అయితే ఈ పిల్ల పళ్ళు ఇకిలించుకుంటూ ఏం మాట్లాడకుండా నిల్చుంటుంది.

రాజా! పచ్చిగా చెప్పాలంటే ఈ పాఠకరావు ప్రవర్తన నాకెందుకో పిచ్చిగా కనపడింది. పత్రికలో ఉన్న కథల పేర్లు చూసినప్పుడు అతడి మొహం తీగపై ఒక నవ్వుపువ్వు ఎందుకు పూచింది? చిటికె వేసిన మరుక్షణంలోనే అతడి కనుబొమలెందుకలా వింటి రూపం ధరించాయి? తన ఇంటి పైకప్పు ఎలా ఉంటుందో అతడికి తెలియదా? దాని వంక ఎందుకు అతడలా చూశాడు?

కవుకుదెబ్బలే​-​
చీకట్లో ఉఫ్ ఉఫ్‌మని
ఊదుకొమ్మంటోంది
నువ్వు కట్టుకున్న
పేక ముక్కల
​గీర మేడల్లో ​
ఎవరికీ తెలీకుండా
ఘొల్లుమని
ఏడవమంటోంది

ఊరు వదిలి నైజాం రాజ్యం వెళ్లిపోయిన చాలాకాలానికి కనపర్తి మీద కతలు రాద్దామనుకున్నాక మళ్లా ఆ ఊరికి వెళ్తారు శౌరీలు. పల్లెకాస్తా పట్నమయిపొయి, ఇళ్లల్లో మనుషులకు బదులుగా టీవీలే మాట్లాడుతున్న వైనం చూసి బిక్కచచ్చిపోతోన్న శౌరీలుకు వాళ్ల పెద్ద జీతగాడు బాలయ్య ఇంట్లో మళ్లీ అప్పటి కనపర్తి దొరుకుతుంది.

తనకు తెలిసిన జీవితాన్నే, తనకు అనుభవంలోకి వచ్చిన సామాజికాంశాలనే తన కథల్లో ప్రదర్శించినాడు సుబ్బరామయ్య. ఆయన తన కథల్లో కల్పననూ, ఊహలనూ ఎప్పుడూ ఆశ్రయించలేదు. తాను జీవించిన విజయవాడ పట్టణమే ఆయన కథల్లో వేదికగా వుండటాన్ని కూడా మనం గుర్తుపట్టవచ్చు. పెద్దిభొట్ల అనగానే మధ్యతరగతి అని గుర్తుండిపోయేలే చాలా కథలు రాసినాడు ఆయన.

విశ్లేషిస్తూ ప్రశ్నల్తో నేను
విపులీకరిస్తూ జవాబుల్తో నువ్వు
ఒకటొకటిగా చెరిగిపోతూ సంకోచాలు
రెక్కలు విచ్చుకొంటూ ఆనందాలు
సరాసరి ఇద్దరం
సర్దుకొంటూ మనసు

రజని రచించి కూర్చిన పద్యనాటికలను విశ్వవీణ అనే పేరుతో సంపుటం చేశారు. ఈమాట గ్రంథాలయం కోసం అరుదైన ఈ పుస్తకం పరుచూరి శ్రీనివాస్ ఈమాటకు పిడిఎఫ్ రూపంలో అందించారు. ఆ సందర్భంగా ఆ పుస్తకపు ముందుమాటగా రజని రాసిన సంగీతనాటకాలు అనే వ్యాసం ఇక్కడ ప్రచురిస్తున్నాం. – సం.

రేచన వ్రాసిన కవిజనాశ్రయము మొదటి తెలుగు గ్రంథము కాదని శాసనముల, తదితర ఆధారముల ద్వారా నిరూపించబడినది. కొన్ని శతాబ్దములకు ముందు ఛందోనియమముల కొఱకు వాడబడిన హలంతములైన పదములను అజంతములుగా ఉచ్చరించేవారని శాసనముల ద్వారా నిరూపించడమైనది.

జోగినాధం నెమ్మదిగా లేచి కూజా దగ్గరికి వెళ్లి నీళ్ళు గ్లాసులోకి వంచుకున్నాడు. చేతితో గ్లాసు పైకెత్తి పట్టుకుని ఒక్క క్షణం చూసి తర్వాత గడగడ త్రాగాడు. అది గమనించి శర్మ అనే మరో గుమాస్తా నవ్వి, “మన కూజాలో నీళ్ళన్నీ ఒక్క జోగినాధంగారే కాజేస్తున్నారండీ… అదేమి చిత్రమో ప్రతి అరగంటకూ ఆయనకు దాహమవుతూ ఉంటుంది” అన్నాడు.

వేదులవారి కవిత్వంలో ఒక గాఢ విషాదపు జీర కనిపిస్తుంది. మహాప్రస్థానానికి పీఠికగా ఇచ్చిన యోగ్యతా పత్రంలో లోకమంతటి బాధా శ్రీశ్రీ బాధైతే, కృష్ణశాస్త్రి బాధ లోకమంతటిదీను అంటాడు చలం. అది కృష్ణశాస్త్రి ఒక్కడిదే అనుకోనక్కరలేదు. దాదాపు భావ కవులందరిలోనూ ఆ లక్షణముంది. వేదులవారి కవిత్వంలో ఐతే మరీను.

సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది. విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. పొరలు పొరలుగా, గజిబిజిగా, గందరగోళంగా, సంక్లిష్టంగా ఉన్న మానవజీవితాన్ని సాహిత్యం వడకట్టి, దాని సారాంశం తేటతెల్లం చేస్తుంది. అటువంటి సాహిత్యాన్ని పరిశీలించి, శోధించి, తాలు తప్ప వేరు చేసి, విలువ కట్టి, అందులో ఉత్తమమైనదేదో వెలికితీస్తుంది విమర్శ. (డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

క్రితం సంచికలోని గడినుడి 19కి గడువు తేదీలోపు ఎవ్వరూ సరైన సమాధానాలు పంపలేక పోయారు.
సరిచూపు సహాయంతో కరక్టుగా నింపిన మొదటి అయిదుగురు: 1. కె. వి. గిరిధరరావు 2. భమిడిపాటి సూర్యలక్ష్మి 3. గిరిజ వారణాసి 4. పంతుల సుధారాణి 5. స్మృతి. వీరందరికీ మా అభినందనలు.