2016
వికీపీడియా నుండి
2016 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
జనవరి 2016[మార్చు]
- జనవరి 1: 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుచే ప్రారంభం.
- జనవరి 2: పంజాబ్ లోని పఠాన్కోట్ ఐ.ఎ.ఎఫ్. కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి. ముగ్గురు వైమానిక సిబ్బంది నలుగురు ఉగ్రవాదుల మృతి.
- జనవరి 3: మైసూరులో "103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" ఐదు రోజుల సదస్సు ప్రారంభం. డా.విక్రం సారాభాయ్ స్మారక అవార్డు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం (షార్) మాజీ డైరెక్టర్ డా.ఎం.వై.ఎస్.ప్రసాద్కు బహూకరణ.
- జనవరి 4: మణిపూర్ లోని తమెంగ్లాంగ్ జిల్లాలో 17కి.మీ.లోతున భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంప తీవ్రత నమోదు. భారీ ఆస్తి నష్టం. భారతదేశంలో 9మంది, బంగ్లాదేశ్లో 5గురు మరణించారు.
- జనవరి 5: ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్లోప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి సరిక్రొత్త రికార్డ్ సృష్టించాడు.
- జనవరి 6: తొలి సారిగా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తరకొరియా ప్రకటించింది.
ఫిబ్రవరి 2016[మార్చు]
మార్చి 2016[మార్చు]
ఏప్రిల్ 2016[మార్చు]
మే 2016[మార్చు]
జూన్ 2016[మార్చు]
జూలై 2016[మార్చు]
ఆగస్టు 2016[మార్చు]
సెప్టెంబర్ 2016[మార్చు]
- భారత క్రికెట్ జట్టు 500వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం. ఈ మ్యాచ్లో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడింది.
అక్టోబర్ 2016[మార్చు]
నవంబర్ 2016[మార్చు]
డిసెంబర్ 2016[మార్చు]
మరణాలు[మార్చు]
- జనవరి 2: ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924)
- జనవరి 4: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)
- జనవరి 7: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936)
- జనవరి 10: డేవిడ్ బౌవీ, బ్రిటీష్ పాప్ మరియు రాక్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత (జ.1947)
- జనవరి 10: పి.ఆర్.రాజు, ప్రముఖ చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు (జ.1928)
- జనవరి 11: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, ప్రముఖ రచయిత, తెలుగు పండితులు. (జ.1936)
- జనవరి 11: పల్లెంపాటి వెంకటేశ్వర్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్ వ్యవస్థాపకుడు. (జ.1927)
- జనవరి 13: అద్దేపల్లి రామమోహనరావు, తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. (జ.1936)
- జనవరి 13: జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్ మరియు గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)
- జనవరి 14: మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (జ.1935)
- జనవరి 16: అనిల్ గంగూలీ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933)
- జనవరి 17: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (జ.1935)
- జనవరి 19: అరూన్ టికేకర్ సీనియర్ పాత్రికేయుడు, విద్యావేత్త.
- జనవరి 19: యలమంచిలి హనుమంతరావు, ఆల్ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (జ.1938)
- జనవరి 19: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903)
- జనవరి 20: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935)
- జనవరి 20: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932)
- జనవరి 21: మృణాళినీ సారాభాయి ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి. (జ.1918)
- జనవరి 21: పరశురామ ఘనాపాఠి ప్రఖ్యాత వేదపండితుడు. (జ.1914)
- జనవరి 22: పండిట్ శంకర్ ఘోష్ భారతీయ తబలా కళాకారుడు. (జ.1935)
- జనవరి 23: ఏ.సి.జోస్ మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ అసెంబ్లీ స్పీకర్. (జ.1937)
- జనవరి 25: కల్పనా రంజని, ప్రముఖ మలయాళ సినిమా నటి. (జ.1965)
- జనవరి 28: గౌరు తిరుపతిరెడ్డి, ప్రముఖ వాస్తునిపుణుడు. (జ.1935)
- జనవరి 28: అరిందమ్ సేన్గుప్తా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.
- జనవరి 30: నాయని కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు రచయిత్రి. (జ.1930)
- జనవరి 30: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
- జనవరి 30: జోగినిపల్లి దామోదర్రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ.
- ఫిబ్రవరి 3: బలరామ్ జక్కర్ ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)
- ఫిబ్రవరి 5: ఎ.జి.కృష్ణమూర్తి, ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. (జ.1942)
- ఫిబ్రవరి 6: సుధీర్ తైలాంగ్, పద్మశ్రీ పురస్కారం పొందిన భారతీయ కార్టూనిస్ట్. (జ.1960)
- ఫిబ్రవరి 12: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి. (జ.1967)
- ఫిబ్రవరి 12: ఎం.ఎల్.నరసింహారావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత మరియు సాహితీవేత్త. (జ.1928)
- ఫిబ్రవరి 25: ఆచ్చి వేణుగోపాలాచార్యులు, ప్రముఖ సినీ గీత రచయిత. (జ.1930)
- మార్చి 4: పి.ఎ.సంగ్మా, లోక్సభ మాజీ స్పీకరు. (జ.1947)
- మార్చి 4: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (జ.1944)
- మార్చి 6: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు మరియు గాయకుడు. (జ.1971)
- మార్చి 22: మల్లెల గురవయ్య, కవి మరియు మదనపల్లె రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1939)
- మార్చి 26: పూసపాటి ఆనంద గజపతి రాజు, విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి. (జ.1950)
- మార్చి 29: జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. ( జ.1941)
- మే 7: బోయ జంగయ్య, ప్రముఖ రచయిత. (జ.1942)
- జూన్ 3: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్. (జ.1942)
- జూన్ 21: గూడ అంజయ్య, జానపదగేయాల రచయిత. (జ.1955)
- జూన్ 22: జె. వి. రమణమూర్తి, ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటుడు, దర్శకుడు. (జ.1933)
- జూన్ 24: నీల్ ఓబ్రీన్, భారతదేశంలోపు మొట్టమొదటి క్విజ్ మాస్టర్.
- జూలై 3: స్వర్ణలతా నాయుడు, ప్రముఖ తెలుగు కవయిత్రి. (జ.1975)
- జూలై 28: మహా శ్వేతాదేవి, సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త. (జ.1926)
- ఆగస్టు 7: దూబగుంట రోశమ్మ, 1991లో సారావ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి నాయకత్వం వహించిన మహిళ.
- ఆగస్టు 11:యాదాటి కాశీపతి అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు మరియు రచయిత.
- ఆగస్టు 11:ఇచ్ఛాపురపు రామచంద్రం, ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. (జ.1940)
- సెప్టెంబరు 16: బొజ్జా తారకం, ప్రముఖ హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939)
- అక్టోబరు 18: చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల ద్వారా ప్రసిద్ధుడైన రచయిత.(జ.1952)