1931
వికీపీడియా నుండి
1931 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1928 1929 1930 - 1931 - 1932 1933 1934 |
దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- ఫిబ్రవరి 10: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
- గాంధీ-ఇర్విన్ ఒడంబడిక జరిగింది.
జననాలు[మార్చు]
- మార్చి 2: మిఖాయిల్ గోర్భచెవ్, సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు.
- ఏప్రిల్ 6: నల్లమల గిరిప్రసాద్, ప్రముఖ కమ్యూనిస్టు నేత. (మ.1997)
- జూన్ 25: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (మ.2008)
- జూన్ 28: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (మ.2011)
- జూలై 1: యస్.రాజన్నకవి, రంగస్థల నటుడు.
- జూలై 18: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2002)
- జూలై 29: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గేయరచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.
- జూలై 30: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (మ.2007)
- ఆగస్టు 3: సూరి బాలకృష్ణ, భూ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త.
- ఆగస్టు 6: గడ్డవరపు పుల్లమాంబ, రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు.
- ఆగస్టు 15: నాగభైరవ కోటేశ్వరరావు ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. (మ.2008)
- ఆగస్టు 20: బి.పద్మనాభం , తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (మ.2010)
- ఆగస్టు 6: గడ్డవరపు పుల్లమాంబ, రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు.
- సెప్టెంబరు 8: తంగి సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుప్రసిద్ధ శాసనసభ్యుడు. (మ.2009)
- అక్టోబర్ 2: తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు మరియు నిజామాబాదు లోకసభ నియోజకవర్గం సభ్యుడు. (మ.2010)
- అక్టోబర్ 15: ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అణు శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి. (మ.2015)
- డిసెంబరు 3: విజయ్కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత.
- డిసెంబరు 5: చాట్ల శ్రీరాములు, ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణులు మరియు సినిమా నటులు. (మ.2015)
- డిసెంబరు 11: ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990)
- డిసెంబరు 21: అవసరాల రామకృష్ణారావు, కథ, నవల రచయిత. (మ.2011)
- : ముక్కురాజు, డాన్స్ మాస్టార్, ఫైటర్, నటుడు (మ.)
- : యోగానంద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (మ.2015)
మరణాలు[మార్చు]
- ఫిబ్రవరి 6: మోతిలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు. (జ.1861)
- ఫిబ్రవరి 27:చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)
- మార్చి 23: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1907)
- మార్చి 23: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు, భగత్ సింగ్ సహచరుడు.
- మార్చి 23: రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1908)
- జూన్ 10: మిడతల హంపయ్య, అనంతపురం జిల్లాకు చెందిన దాత
- అక్టోబర్ 18: థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త. (జ.1847)